దైవచింతన కలిగి ఉండాలి
ABN , First Publish Date - 2020-08-11T10:35:42+05:30 IST
ప్రతిఒక్కరూ దైవచింతన కలిగి ఉండాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.
విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
శంకర్పల్లి: ప్రతిఒక్కరూ దైవచింతన కలిగి ఉండాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మునిసిపాలిటీ పరిధిలోని చందిప్ప గ్రామంలోని హనుమాన్ ఆలయ ఆవరణలో ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ సంతోష్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన అభయాంజనేయ స్వామి భారీ విగ్రహాన్ని సోమవారం ఆమె ఆవిష్కరించి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ దైవచింతనతో ప్రజల్లో ఆధ్మాత్మిక భావాలు పెంపొందుతాయన్నారు. విగ్రహ ఏర్పాటుకు సహకరించిన దాతలను అభినందించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, మున్సిపాల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, నర్సింహులు, వెంకట్రామ్రెడ్డి, వెంకట్రెడ్డి, గోవర్ధన్రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.