ఎన్టీఆర్ అవార్డుకు ముస్తఫా ఎంపిక
ABN , First Publish Date - 2022-01-19T06:38:07+05:30 IST
మండలంలోని జాన్పహాడ్ గ్రామానికి చెందిన శ్రీవెంకటే శ్వర నాట్య కళాపరిషత్ ఉమ్మడి మండల అధ్యక్షుడు షేక్ ముస్తఫా ఎన్టీఆర్ అవా ర్డుకు ఎంపికయ్యారు.
పాలకవీడు, జనవరి18: మండలంలోని జాన్పహాడ్ గ్రామానికి చెందిన శ్రీవెంకటే శ్వర నాట్య కళాపరిషత్ ఉమ్మడి మండల అధ్యక్షుడు షేక్ ముస్తఫా ఎన్టీఆర్ అవా ర్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ముస్తఫా విలేకరులతో మంగళవారం మాట్లాడుతూ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నాటక రంగ కళాకారులకు ఇచ్చే అవార్డును ఈ సంవత్సరం తనకు రావడం ఆనందంగా ఉందన్నారు. హైదరాబాద్లో ఈ నెల 26న ఈ అవార్డును ప్రదానం చేస్తారన్నారు