బాలవిహార్లో మందుపార్టీపై Nallagonda కలెక్టర్ ఆగ్రహం
ABN , First Publish Date - 2021-12-18T18:12:40+05:30 IST
జిల్లాలోని నాగార్జున సాగర్ బాల విహార్లో మందు పార్టీపై కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నల్గొండ: జిల్లాలోని నాగార్జున సాగర్ బాల విహార్లో మందు పార్టీపై కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఏపీకి చెందిన ఓ ఫర్టిలైజర్ కంపెనీ డీలర్స్ బాల విహార్లో మందు, విందు జరుపుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ కార్యాలయంలో మందు సేవించడంపై కలెక్టర్ ఆగ్రహించారు. కలెక్టర్ ఆదేశాలతో బాల విహార్ కార్యాలయాన్ని రెవిన్యూ అధికారులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక నుంచి బాల విహార్లో ప్రైవేట్ కార్యక్రమాలు నిర్వహించరాదని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశాలు జారీ చేశారు.