ఏపీజేఎంఏ అధ్యక్ష, కార్యదర్శులుగా నరసింహులు, రాజగోపాల్రెడ్డి
ABN , First Publish Date - 2022-01-24T05:14:48+05:30 IST
ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్య సంఘం (జేఎంఏ) నూతన జి ల్లా కార్యవర్గాన్ని ఆదివారం కడపలోని శ్రీనివాస రెసిడెన్సీలో ఎన్నుకున్నారు.
కడప(ఎడ్యుకేషన్), జనవరి 23: ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్య సంఘం (జేఎంఏ) నూతన జి ల్లా కార్యవర్గాన్ని ఆదివారం కడపలోని శ్రీనివాస రెసిడెన్సీలో ఎన్నుకున్నారు. నూ తన అధ్యక్షుడిగా నరసింహులు, కార్యదర్శిగా రాజగోపాల్రెడ్డి, గౌరవాధ్యక్షుడిగా శ్రీనివాసులు, శివగంగిరెడ్డి, ఆర్థిక కార్యదర్శిగా విశ్వనాథ్రెడ్డి, ఉపాధ్యక్షుడిగా భూ మిరెడ్డి విజయభారతి, వలీ, మునిభాస్కర్రెడ్డి, సహాయ కార్యదర్శులుగా అశోక్రెడ్డి, వినయ్కుమార్, లక్ష్మీనారాయణ, మరికొందరు సభ్యులను ఎన్నుకున్నారు. ప్రైవేట్ కళాశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతన కమిటీ పేర్కొంది. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా కళాశాల కరెస్పాండెంట్లు తదితరులు హాజరయ్యారు.