జిల్లా ఎనసీసీ గ్రూపునకు ద్వితీయస్థానం
ABN , First Publish Date - 2021-10-27T05:15:23+05:30 IST
ఉభయ తెలుగు రాషా్ట్రల ఎనసీసీ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో తిరుపతిలో ఈనెల 17నుంచి 26 వరకు జరిగిన ఎనసీసీ ఇంటర్ గ్రూప్ ఛాంపియనషిప్ పోటీల్లో గుంటూరు ఎనసీసీ గ్రూప్ ద్వితీయస్థానం సాధించింది.
గుంటూరు(క్రీడలు), అక్టోబరు 26: ఉభయ తెలుగు రాషా్ట్రల ఎనసీసీ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో తిరుపతిలో ఈనెల 17నుంచి 26 వరకు జరిగిన ఎనసీసీ ఇంటర్ గ్రూప్ ఛాంపియనషిప్ పోటీల్లో గుంటూరు ఎనసీసీ గ్రూప్ ద్వితీయస్థానం సాధించింది. మార్ఫింగ్, ఫ్లాగ్ ఏరియా పోటీలలో ప్రథమ స్థానం, సాంస్కృతిక లైన ఏరియా పోటీలలో రెండో స్థానంలో నిలిచారు. ఎనసీసీ కాడెట్స్ని, ఏఎనవోలను గుంటూరు గ్రూపు కమాండర్ కల్నల్ జయకుమార్ అభినందించారు.