బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ‌కి కొత్త అర్థం చెప్పిన శశి థరూర్

ABN , First Publish Date - 2020-09-22T21:04:10+05:30 IST

కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ బీజేపీ నేతృత్వంలోని కూటమి ఎన్డీయేకి కొత్త అర్థం చెప్పారు. పార్లమెంటులో ఎన్డీయే వ్యవహరిస్తున్న తీరును

బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ‌కి కొత్త అర్థం చెప్పిన  శశి థరూర్

న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ బీజేపీ నేతృత్వంలోని కూటమి ఎన్డీయేకి కొత్త అర్థం చెప్పారు. పార్లమెంటులో ఎన్డీయే వ్యవహరిస్తున్న తీరును ఘాటుగా విమర్శించారు. వలస కూలీలు, రైతుల ఆత్మహత్యల గురించి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలను దుయ్యబట్టారు. 


శశి థరూర్ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘ఎన్‌డీఏ = నో డేటా అవైలబుల్’’ అని ప్రధాని మోదీ ప్రభుత్వానికి చురకలు వేశారు. 


‘‘వలస కూలీల గురించి సమాచారం లేదు. రైతుల ఆత్మహత్యలపై సమాచారం లేదు. ఆర్థిక ప్రోత్సాహకాలపై తప్పుడు డేటా ఉంది, కోవిడ్ మరణాల గురించి నమ్మకూడని సమాచారం ఉంది, జీడీపీ వృద్ధిపై మసక మసక సమాచారం ఉంది. ఈ ప్రభుత్వం ఎన్డీయేకి కొత్త అర్థాన్ని ఇస్తోంది’’  అని పేర్కొంటూ, ఈ ట్వీట్‌కు ఓ కార్టూన్‌ను జత చేశారు. 


ప్రభుత్వం వద్ద ఎటువంటి సమాచారం లేదని పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలు, దేశవ్యాప్త అష్టదిగ్బంధనం సమయంలో కోవిడ్-19 వల్ల ప్రాణాలు కోల్పోయినవారు, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉద్యోగాలు కోల్పోయినవారి సంఖ్య, దేశంలోకి అక్రమంగా వచ్చినవారి సంఖ్య, కోవిడ్-19 వల్ల మరణించినవారి సంఖ్య మొదలైన వివరాలు ఈ ప్రభుత్వానికి తెలియవన్నారు. దేశంలో ప్లాస్మా బ్యాంకుల సంఖ్య కూడా తెలియదన్నారు. 


Updated Date - 2020-09-22T21:04:10+05:30 IST