పారిశుధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
ABN , First Publish Date - 2021-08-03T07:43:02+05:30 IST
పాఠశాల పారిశుధ్య కార్మికులకు (ఆయాలు) ఉద్యోగ భద్రత కల్పించి పెండింగ్లో ఉన్న వేతనాలను మంజూరు చేయాలని ఏఐటీయూసీ నాయకులు యాసిన్ డిమాండ్ చేశారు.
కనిగిరి, ఆగస్టు 2: పాఠశాల పారిశుధ్య కార్మికులకు (ఆయాలు) ఉద్యోగ భద్రత కల్పించి పెండింగ్లో ఉన్న వేతనాలను మంజూరు చేయాలని ఏఐటీయూసీ నాయకులు యాసిన్ డిమాండ్ చేశారు. స్థానిక దర్శి చెంచయ్య భవనంలో కనిగిరి, హెచ్ఎంపాడు మండలాలకు చెందిన పాఠశాల పారిశుద్య కార్మికుల సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఆయాలపై రాజకీయ వేధింపులు లేకుండా యూనియన్ అండగా నిలబడుతుందన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వేతనాలు మంజూరు అయ్యేలా కృషి చేస్తామన్నారు. కొన్నిచోట్ల ప్రధానోపాధ్యాయులు ఆయాలపై కక్షసాధింపు చర్యలు చేస్తూ పలు రకాల ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు గుజ్జుల బాలిరెడ్డి, సీపీఐ నాయకులు జీపీ రామారావు, సునీత, పాపులమ్మ, సమాధానం తదితరులు పాల్గొన్నారు.