నీరు చెట్టు బిల్లులపై చర్చ

ABN , First Publish Date - 2021-10-24T03:25:11+05:30 IST

ఏళ్ల తరబడి పెండింగ్‌లో వున్న నీరు చెట్టు, ఉపాధిహామీ పథకం బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేస్తుండటంతో, వీటిని ఇప్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై శనివారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో బీద రవిచంద్ర, వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చర్చించారు.

నీరు చెట్టు బిల్లులపై చర్చ
నీరు చెట్టు బిల్లులపై చర్చిస్తున్న కురుగొండ్ల, బీద రవిచంద్ర

వెంకటగిరి, అక్టోబరు 23 : ఏళ్ల తరబడి పెండింగ్‌లో వున్న నీరు చెట్టు, ఉపాధిహామీ పథకం బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేస్తుండటంతో, వీటిని ఇప్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై శనివారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో బీద రవిచంద్ర, వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చర్చించారు. బిల్లుల వివరాలను తెప్పించుకుని పెండింగ్‌ బిల్లులు చెల్లించే విధంగా ప్రభుత్వంపై వత్తిడి తీసుకురానున్నట్లు తెలిపింది. ప్రభుత్వం స్పందించక పోతే హైకోర్టును ఆశ్రయించేందుకు న్యాయనిపుణలను సంప్రదిస్తున్నారు.

Updated Date - 2021-10-24T03:25:11+05:30 IST