సీఎంను కలిసిన నెక్కలనాయుడుబాబు
ABN , First Publish Date - 2020-08-12T10:22:04+05:30 IST
మండలంలో రామలిం గపురం గ్రామానికి చెందిన రాష్ట్ర వైసీపీ కార్యదర్శి నెక్కల నాయు డుబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని తాడేపల్లి గూడెంలోని క్యాంప్ కార్యాలయంలో మంగళ వారం కలిశారు.
కొత్తవలస, ఆగ స్టు 11: మండలంలో రామలిం గపురం గ్రామానికి చెందిన రాష్ట్ర వైసీపీ కార్యదర్శి నెక్కల నాయు డుబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని తాడేపల్లి గూడెంలోని క్యాంప్ కార్యాలయంలో మంగళ వారం కలిశారు. 2014 సంవత్సరంలో వైసీపీ పరాజయం తరు వాత శృంగవరపు కోట నియోజకవర్గ సమన్వయకర్తగా ఎవరూ బాధ్యతలు స్వీకరించకపొవడంతో నియోజక వర్గంలో పార్టీని బలోపేతం చేస్తానని జగన్మోహనరెడ్డికి మాటిచ్చి బాధ్య తలు స్వీకరించి కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచారు.
పార్టీ అధికారంలోకి వచ్చినా ఇంతవరకు నాయు డుబాబు ఎటువంటి పదవులు ఆశించ కుండా ఎమ్మెల్యే శ్రీనివాస రావుతో కలసి పని చేస్తున్నారు. ముఖ్యమంత్రిని కూడా ఇంతవరకు నేరుగా కలసి ఎటువంటి పదవులకోసం పైరవీ లు చేయలేదు. తనకు పూర్తి మద్దతు ఇస్తూ నియోజక వర్గంలో పనిచేస్తున్నట్టు ఎమ్మెల్యే శ్రీనివాసరావు కూడా ముఖ్యమంత్రికి వివరించారు. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడం పట్ల నాయుడుబాబు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.