Nellore జీజీహెచ్లో మరో ఘోరం
ABN , First Publish Date - 2021-10-21T14:13:55+05:30 IST
జిల్లాలోని జీజీహెచ్లో మరో ఘోరం చోటు చేసుకుంది. కరోనాతో మృతి చెందిన గిరిజన మహిళ మృతదేహాం ఇచ్చేందుకు సిబ్బంది రూ.5వేలు డిమాండ్ చేసింది.
నెల్లూరు: జిల్లాలోని జీజీహెచ్లో మరో ఘోరం చోటు చేసుకుంది. కరోనాతో మృతి చెందిన గిరిజన మహిళ మృతదేహం ఇచ్చేందుకు సిబ్బంది రూ.5వేలు డిమాండ్ చేసింది. రూ.వెయ్యి ఇచ్చినా సిబ్బంది కరుణించని పరిస్థితి ఉంది. గత రెండు రోజులుగా మృతదేహాన్ని అప్పగించేందుకు సిబ్బంది నిరాకరిస్తోంది. దీంతో జీజీహెచ్ ఎదుట మృతురాలి బంధువులు నిరసనకు దిగారు. మరికాసేపట్లో విచారించి, డబ్బులు డిమాండ్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ వెల్లడించారు.