కరోనాతో నాడీ కండరాల సమస్య
ABN , First Publish Date - 2020-08-05T08:04:19+05:30 IST
కరోనా వల్ల నాడీ కండరాల సమస్య ఉత్పన్నమవుతుందని, ఒకవేళ గతంలో ఆ సమస్య ఉంటే.. కరోనా వైద్యంలో భాగంగా రోగ నిరోధక శక్తిని పెంచే
న్యూయార్క్, ఆగస్టు 4: కరోనా వల్ల నాడీ కండరాల సమస్య ఉత్పన్నమవుతుందని, ఒకవేళ గతంలో ఆ సమస్య ఉంటే.. కరోనా వైద్యంలో భాగంగా రోగ నిరోధక శక్తిని పెంచే చికిత్స వల్ల నాడీ కండరాల సమస్య మరింత ఎక్కువ అవుతుందని ఒక పరిశోధన తేల్చింది. కరోనా ప్రారంభం నుంచి జూన్ 18 వర కూ వివిధ జర్నల్స్లో ప్రచురితమైన 547 పత్రాలను విశ్లేషించడం ద్వారా ఈ విషయం వెలుగు చూసిందని అమెరికాలోని బఫ్ఫలో విశ్వవిద్యాలయానికి చెందిన గిల్ వోల్ఫ్ పేర్కొన్నారు.