మరణం లేని గొప్ప దేశభక్తుడు నేతాజీ

ABN , First Publish Date - 2022-01-24T05:45:32+05:30 IST

స్వతంత్ర సేనాని సుభాష్‌ చంద్రబోస్‌ అని పలువురు వక్తలు కొనియాడారు.

మరణం లేని గొప్ప దేశభక్తుడు నేతాజీ
నేతాజీ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న డీఎస్పీ, నాయకులు

నల్లగొండ క్రైం, జనవరి 23: స్వతంత్ర సేనాని సుభాష్‌ చంద్రబోస్‌ అని పలువురు వక్తలు కొనియాడారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రత్యేక సైన్యాన్ని నడిపిన ధైర్యశాలి నేతాజీ అని అన్నారు. మరణం లేని గొప్ప దేశ భక్తుడు చంద్రబోస్‌ అని కీర్తించారు. జిల్లాకేంద్రంలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఉత్సవానికి డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై చంద్రబోస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదే విధంగా జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జాతీయ గీతాలాపన విజయవంతంగా 365 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా  పట్టణంలో ఉత్సవాలు నిర్వహించా రు. కార్యక్రమంలో జనగణమన సమితి గౌరవ అధ్యక్షుడు దోసపా టి శ్రీనివాస్‌, ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి కొలనుపాక రవికుమార్‌, కోశాధికారి నాగేందర్‌, సభ్యులు రాంరెడ్డి, హిమవంతరెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, జనార్ధన, గణేష్‌, భరద్వాజ్‌, హరికృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు, ట్రాఫిక్‌ సీఐ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. అంతేకాకుండా జిల్లాలోని పలు మండలాల్లో యువజన సంఘాలు, వీహెచపీ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నేతాజీ జయంతిని నిర్వహించారు.

Updated Date - 2022-01-24T05:45:32+05:30 IST