మూడు జిల్లాలకు కొత్త కలెక్టర్లు

ABN , First Publish Date - 2020-10-25T06:31:12+05:30 IST

మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు శనివారం ప్రభుత్వం కొత్త కలెక్టర్లను నియమించింది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులను ఒకేసారి బదిలీ చేయడం గమనార్హం.

మూడు జిల్లాలకు కొత్త కలెక్టర్లు

వెంకట్రామారెడ్డి సంగారెడ్డికి బదిలీ

మెదక్‌ జిల్లాకు హన్మంతరావు

సిద్దిపేటకు భారతి హోళికెరీ నియామకం


ఆంధ్రజ్యోతి, మెదక్‌, అక్టోబరు 24 : మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు శనివారం ప్రభుత్వం కొత్త కలెక్టర్లను నియమించింది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులను ఒకేసారి బదిలీ చేయడం గమనార్హం. ప్రస్తుత సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామారెడ్డిని సంగారెడ్డికి, సంగారెడ్డి కలెక్టర్‌ హన్మంతరావును మెదక్‌కు, మంచిర్యాల కలెక్టర్‌గా ఉన్న భారతి హోళికెరీని సిద్దిపేటకు బదిలీ చేశారు. మెదక్‌ కలెక్టర్‌గా పని చేసిన ధర్మారెడ్డి జూలై 31న ఉద్యోగ విరమణ చేయగా...ఇన్‌చార్జి బాధ్యతలను వెంకట్రామారెడ్డికి అప్పగించారు. దుబ్బాక ఉప ఎన్నికలు, ఇతర కారణాల నేపథ్యంలో ప్రభుత్వం పలువురు ఐఏఎ్‌సలకు స్థానచలనం కల్పించింది. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, వెంకట్రామారెడ్డి సిద్దిపేట జిల్లా తొలి కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత 2018లో సిరిసిల్ల కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. 10 నెలల అనంతరం తిరిగి సిద్దిపేటకు వచ్చారు.

Updated Date - 2020-10-25T06:31:12+05:30 IST