అస్సాంలో కొత్తగా 33 కోవిడ్-19 పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-05-29T03:32:56+05:30 IST
అస్సాంలో కొత్తగా 33 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
న్యూఢిల్లీ : అస్సాంలో కొత్తగా 33 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 831కి చేరింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ గురువారం మాట్లాడుతూ రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 737 ఉన్నట్లు తెలిపారు. వీరిలో 87 మంది కోలుకున్నట్లు తెలిపారు. చికిత్స అనంతరం వీరిని ఆసుపత్రుల నుంచి విడుదల చేసినట్లు చెప్పారు. అస్సాంలో కోవిడ్-19 వ్యాధి కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గురువారం సాయంత్రానికి అందిన సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 1,024 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. నమోదైన మొత్తం కేసుల సంఖ్య 16,281 కాగా, గడిచిన 24 గంటల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు, దీంతో మొత్తం మృతుల సంఖ్య 316కు చేరింది. ఈ వ్యాధి నుంచి 7,495 మంది కోలుకోగా, ప్రస్తుతం 8,470 మంది చికిత్స పొందుతున్నారు.