మూడు నెలల కూడా కాకముందే ఘోరం.. బయటపడ్డ నవదంపతుల మృతదేహాలు..

ABN , First Publish Date - 2020-08-14T17:38:06+05:30 IST

నాగిరెడ్డిపేట్ మండలంలోని పోచారం ప్రాజెక్టులో నవ దంపతుల మృతదేహలు లభ్య మయ్యాయి. ఎస్సై రాజయ్య తెలిపిన వివరాల ప్రకారం..

మూడు నెలల కూడా కాకముందే ఘోరం.. బయటపడ్డ నవదంపతుల మృతదేహాలు..

పోచారం ప్రాజెక్టులో నవ దంపతుల మృతదేహాలు లభ్యం


నాగిరెడ్డిపేట్‌(నిజామాబాద్): నాగిరెడ్డిపేట్ మండలంలోని పోచారం ప్రాజెక్టులో  నవ దంపతుల మృతదేహలు లభ్య మయ్యాయి. ఎస్సై రాజయ్య  తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బిజిగం చెరువు తండా గ్రామ పంచాయతీ పరిధి ని ఎర్రకుంట తండాకు చెందిన శిరిష(20)కు కామారెడ్డి మండలంలోని క్యాసంపల్లి మహేంద ర్‌(22)తో గత మే 18న వివాహం జరిగింది. బుధవారం సాయంత్రం ఇద్దరు దంపతులు ద్విచక్రవాహనంపై నుంచి బయలుదేరారు. రాత్రైనా ఇంటికి రాలేదు. దీంతో గురువారం వెతుకగా.. పోచారం ప్రాజెక్టు వద్ద ద్విచక్ర వాహనం, చెప్పులు కనిపించాయి. ఎస్సై రాజయ్య జాలర్లతో వెతికించగా.. మృ తదేహలు లభ్యమయ్యాయి. మృతికి గల కారణాలు తెలియరాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - 2020-08-14T17:38:06+05:30 IST