జిల్లాలో మరో 29 కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2020-08-02T10:55:03+05:30 IST
జిల్లాలో మరో 29 కరోనా పాజిటివ్
ఆదిలాబాద్ టౌన్, ఆదిలాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు మరో 29 వెలు గు చూశాయి. ఈ మేరకు శనివారం వైద్యా ఆరోగ్య శాఖాధికారులు కేసుల వివరాల ను వెల్లడించారు. ఇందులో భుక్తాపూర్లో 6, చోటాతలాబ్లో 3, ద్వారకనగర్లో 3, జీఎస్ ఎస్టేట్లో 5, ఉట్నూర్ మండలం కొత్తగూడ గ్రామంలో 1, ఆదిలాబాద్ మసూద్నగర్లో 1, పిట్టలవాడలో 1, రవీంద్రనగర్లో 1, సంజయ్నగర్లో 2, శాంతినగర్లో 2, విద్యానగర్లో 3చొప్పున మొత్తం 29 పాజిటివ్ కేసులు నమోద య్యాయి. ఇందులో 9మంది మహిళలు, 20మంది పురుషులు, చిన్నపిల్లలు ఉన్నారు. అయితే జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 243కు చేరుకుంది. ప్రజలు రాబో యే రోజుల్లో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని, భౌతికదూరం పాటించాలని, మా స్కులు ధరించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. లేనిపక్షంలో కేసులు అధిక సంఖ్యలో నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.