తదుపరి ముఖ్యమంత్రిని నేనే..
ABN , First Publish Date - 2021-07-21T17:14:36+05:30 IST
రాష్ట్రంలో నాయకత్వ మార్పు అంశంపై బీజేపీ అధిష్ఠానం ఓపక్క ఊగిసలాడుతుంటే అధికార పార్టీకి చెందిన మంత్రులు కొందరు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. పౌర, ఆహార సరఫరాలశాఖ
- మంత్రి ఉమేశ్ కత్తి సంచలన ప్రకటన
బెంగళూరు: రాష్ట్రంలో నాయకత్వ మార్పు అంశంపై బీజేపీ అధిష్ఠానం ఓపక్క ఊగిసలాడుతుంటే అధికార పార్టీకి చెందిన మంత్రులు కొందరు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. పౌర, ఆహార సరఫరాలశాఖ మంత్రి ఉమేశ్కత్తి బెళగావిలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఒకవేళ నాయకత్వ మార్పు ఖచ్చితమైతే 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నాలుగుసార్లు మంత్రిగా వ్యవహరించిన తనకు తొలి అ వకాశం దక్కాల్సి ఉందన్నారు. అర్హతల పరంగా చూస్తే తదుపరి ముఖ్యమంత్రిని తానే అన్నారు. అయితే ఈ విషయంలో అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ముక్తాయింపు ఇవ్వడం విశేషం.