రైతులకు వైసీపీ ప్రభుత్వం చేసిందేమీలేదు: చినరాజప్ప

ABN , First Publish Date - 2020-07-17T11:37:17+05:30 IST

రాష్ట్రంలో రైతులకు వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.

రైతులకు వైసీపీ ప్రభుత్వం చేసిందేమీలేదు: చినరాజప్ప

సామర్లకోట, జూలై 16: రాష్ట్రంలో రైతులకు వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సామర్లకోట మండలం అచ్చంపేటలోని తన నివాసంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా ఇప్పటికీ కనీసం పవర్‌ టిల్లర్లు, స్ర్పేయర్లు పంపిణీ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. గతంలో రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి నేటికీ సొమ్ములు చెల్లించలేదని అన్నారు. జిల్లా వ్యాప్తంగా రూ.400 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు.  అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేసి కేవలం 5 రూపాయలకే భోజనం పెట్టి పేదల కడుపులు నింపామన్నారు. అటువంటి పథకాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేయడమే కాక కోర్టులను మానవ హక్కుల కమిషన్‌ను తప్పుదోవ పట్టించడం విచారకరమన్నారు.  మంత్రి కన్నబాబు రైతు కార్యక్రమాలు విస్మరించి టీడీపీ అధినేత చంద్రబాబుపై గ్లోబల్‌ ప్రచారం చేయడమే దినచర్యగా పెట్టుకున్నారన్నారు.  

Updated Date - 2020-07-17T11:37:17+05:30 IST