గూడు లేదు.. కూడు లేదు
ABN , First Publish Date - 2021-08-09T16:24:31+05:30 IST
‘ఉండటానికి గూడు లేదు....
పట్టించుకునే నాథుడూ లేడు
సభా ప్రాంగణంలో గంటందొర మనుమడు గాం బోడిదొర ఆవేదన
నర్సీపట్నం/ కృష్ణాదేవిపేట: ‘ఉండటానికి గూడు లేదు.. తినటానికి తిండి లేదు... స్వాతంత్య్ర సమర యోధుల కుంటుంబాలను పట్టించుకునే నాథుడూ లేడు..’’ అని అల్లూరి అనుచరుడు, గంటందొర మనుమడు గాం బోడిదొర ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం కేంద్ర మంత్రి పర్యటన సందర్భంగా కృష్ణాదేవిపేట అల్లూరి పార్కులో విలేఖరులతో మాట్లాడారు. ఉండటానికి ఇల్లు లేదని, ఒకానొక సమయంలో ఇల్లు కట్టిస్తామని ఇచ్చిన సిమెంటు బస్తాలు గట్టిబడి పోయాయని తెలిపారు. అల్లూరి జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు తమ కుటుంబ సభ్యులను ఆహ్వానించి సన్మానాలు చేస్తున్నారని, ఆ తర్వాత పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధుడు గంటందొర వారసులమైన తమను ఆదుకోవాలని కోరారు.