Economics Nobel: ముగ్గురు విజేతలు వీరే..
ABN , First Publish Date - 2021-10-11T22:15:48+05:30 IST
ఎకనమిక్ సైన్స్లో ఈ ఏడాది ముగ్గురికి నోబెల్ బహుమతి వరించింది. లేబర్ ఎకనమిక్స్పై అనుభావిక రచనలు
స్వీడన్: ఎకనమిక్ సైన్స్లో ఈ ఏడాది ముగ్గురిని నోబెల్ బహుమతి వరించింది. లేబర్ ఎకనమిక్స్పై అనుభావిక రచనలు చేసినందుకు గాను సగం బహుమతిని డేవిడ్ కార్డ్కు ప్రకటించగా, సాధారణ సంబంధాలపై విశ్లేషణపూర్వక మెథడోలాజికల్ రచనలకు గాను జోషువా డి.అంగ్రిస్ట్, గైడో డబ్ల్యూ ఇంబెన్స్కు సంయుక్తంగా మిగతా సగం బహుమతిని ప్రకటించింది. సామాజిక శాస్త్రంలోని చాలా వరకు పెద్ద సమస్యలు కారణం, ప్రభావంతో వ్యవహరిస్తాయని స్వీడిష్ అకాడమీ పేర్కొంది.
వేతనం, ఉపాధి స్థాయులపై ఇమ్మిగ్రేషన్ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? సుదీర్ఘ విద్య ఒకరి భవిష్యత్తు ఆదాయంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? లాంటి ప్రశ్నలకు సహజ ప్రయోగాల ద్వారా సమాధానం ఇవ్వడం సాధ్యమని బహుమతి గ్రహీతలు నిరూపించారని స్వీడిష్ అకాడమీ పేర్కొంది. ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతిని స్టాక్హోమ్లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రదానం చేస్తుంది. కాగా, ఎకనమిక్స్లో గతేడాది పాల్ ఆర్.మిల్గ్రామ్, రాబర్ట్ బి.విల్సన్లు సంయుక్తంగా అందుకున్నారు.