నార్త్జోన జట్టు విజయం
ABN , First Publish Date - 2021-10-18T06:03:40+05:30 IST
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన, అంతర్జోనల్ స్థాయి క్రికెట్ పోటీల్లో నార్త్జోన జట్టు విజయం సాధించింది.
అనంతపురం క్లాక్టవర్, అక్టోబరు 17 : ఆంధ్రా క్రికెట్ అసోసియేషన, అంతర్జోనల్ స్థాయి క్రికెట్ పోటీల్లో నార్త్జోన జట్టు విజయం సాధించింది. మూడో రోజు ఆది వారం స్థానిక ఆర్డీటీ స్టేడియంలో ఆంధ్రాక్రికెట్ అం డర్-25 వన్డే అంతర్జోనల్ క్రికెట్లీగ్ పోటీలు కొనసాగాయి. మొదట బ్యాటింగ్ చేసిన సౌత జోన జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. ఇందులో ధ్రువకుమార్ 34, గిరినాథ్రెడ్డి 33, యూఎంఎస్ గిరినాథ్ 31పరుగులు చేశారు. అనంతరం బరిలోకి దిగిన నార్త్జోన జట్టు 39.3ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇందులో హర్షవర్దన సెంచరీ (102) చేయగా, అవినాశ 42పరుగులు చేశాడు. దీంతో నార్త్జోన జట్టు 5వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ కార్యక్రమంలో జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పగడాల మల్లికార్జున, మధు, సభ్యులు, కోచలు తదితరులు పాల్గొన్నారు.