UP అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను: అఖిలేష్

ABN , First Publish Date - 2021-11-01T20:44:52+05:30 IST

వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. సమాజ్‌వాదీ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన అఖిలేష్.. ఈ ప్రకటన చేయడంతో యూపీ రాజకీయాల్లో..

UP అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను: అఖిలేష్

లఖ్‌నవూ: వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. సమాజ్‌వాదీ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన అఖిలేష్.. ఈ ప్రకటన చేయడంతో యూపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఆయన అజాంగఢ్ లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2012 నుంచి 2017 వరకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పని చేసియ అఖిలేష్.. ఆ సమయంలో మండలి నుంచి ప్రాతినిథ్యం వహించారు. అఖిలేష్ ఎప్పుడూ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయలేదు. అయితే ఈసారి అసెంబ్లీకి అఖిలేష్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి తెర దించుతూ తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ దిగడం లేదని అఖిలేష్ ప్రకటించారు.

Updated Date - 2021-11-01T20:44:52+05:30 IST