మూడు రాజధానులను కోరుకోవడం లేదు
ABN , First Publish Date - 2020-08-04T10:48:35+05:30 IST
రాష్ట్ర ప్రజలు మూడు రాజధానులను కోరుకోవడం లేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ..
కర్నూలు(అగ్రికల్చర్), ఆగస్టు 3: రాష్ట్ర ప్రజలు మూడు రాజధానులను కోరుకోవడం లేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా నుంచి గట్టెక్కించాలని ప్రజలు కోరుతు న్నారని అన్నారు. రాజకీయ పార్టీలు ఒక్కటై ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు. సీఎం జగన్ పిచ్చి తుగ్లక్లా వ్యవహరిస్తూ, రాష్ట్రాన్ని అధోగతి పట్టిస్తున్నారని ఆరోపించారు.
మంత్రులు, వైసీపీ నాయకులు సరిదిద్దకుండా జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడం దారుణమని అన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ప్రభు త్వం ఉందని అన్నారు. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై కక్షతోనే రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేశారని ఆరోపించారు. రాయలసీమలో నీటి పారుదల ప్రాజెక్టుల ఏర్పాటుపై సత్వర నిర్ణయం తీసుకోవాలని సోమిశెట్టి డిమాండ్ చేశారు.