ఆ విద్యార్థి నీట్ ఆల్ ఇండియా టాపర్ కాదు
ABN , First Publish Date - 2020-10-22T07:52:27+05:30 IST
నీట్ మార్కుల పునఃపరిశీలనలో రాజస్థాన్కు చెందిన ఓ విద్యార్థికి ఎస్టీ కేటగిరీలో ఆల్ ఇండియా టాప్ ర్యాంకు వచ్చిందన్న వార్తలు అవాస్తవమని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ...
- ఆయన స్కోరును పునఃపరిశీలించలేదు: ఎన్టీఏ
కోట(రాజస్థాన్), అక్టోబరు 21: నీట్ మార్కుల పునఃపరిశీలనలో రాజస్థాన్కు చెందిన ఓ విద్యార్థికి ఎస్టీ కేటగిరీలో ఆల్ ఇండియా టాప్ ర్యాంకు వచ్చిందన్న వార్తలు అవాస్తవమని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేర్కొంది. ఆ విద్యార్థి స్కోరును తాము పునఃపరిశీలించలేదని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ వినీత్ జోషి స్పష్టం చేశారు. ఆ విద్యార్థి చెబుతున్నట్లుగా ఎలాంటి ఈ-మెయిల్నూ ఎన్టీఏ పంపలేదన్నారు. వాస్తవాలను నిర్ధారించుకోకుండా తప్పుడు వార్తలను ప్రసారం చేసిన స్థానిక్ న్యూస్ చానెళ్లపై నోయిడాలోని సైబర్ సెక్యూరిటీ సెల్లో ఫిర్యాదు చేశామన్నారు. రావత్ మాత్రం తనకు 650 మార్కులు వచ్చి ఉంటాయని, ఒరిజినల్ ఓఎంఆర్ షీట్ను పంపించాలని ఎన్టీఏను కోరాడు. కాగా, రాజస్థాన్కు చెందిన గౌరవ్ ప్రకాశ్ అనే మరో విద్యార్థి ఎస్టీ కేటగిరీలో తనకు మొదటి ర్యాంకు లభించిందని, 720కి 700 మార్కులు వచ్చినట్లు పేర్కొన్నాడు.