దుబాయ్లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు
ABN , First Publish Date - 2022-06-13T06:21:46+05:30 IST
దుబాయ్లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు
హాజరైన పీతల సుజాత బృందం
వీరవాసరం, జూన్ 12: దుబాయ్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయని మాజీ మంత్రి పీతల సుజాత తెలిపారు. టీడీపీ ఎన్ఆర్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ జయంతి వేడుకలకు సుజాత నేతృత్వంలో ప్రత్యేక బృందం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ వేడుకల్లో పొలిట్బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం, తెలుగు యువత రాష్ట్ర అధికారి ప్రతినిధి బండారు వంశీకృష్ణ పాల్గొన్నారు.