కారణజన్ముడు ఎన్టీఆర్: బొండా ఉమా
ABN , First Publish Date - 2022-01-19T06:47:45+05:30 IST
కారణజన్ముడు ఎన్టీఆర్: బొండా ఉమా
పాయకాపురం, జనవరి 18: టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు కారణజన్ముడని టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు 61, 62, 63, 64వ డివిజన్లలో మంగళవారం నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి బొండా ఉమా పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వృద్ధులకు, చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, ఎరుబోతు రమణారావు, దాసరి కనకారావు, లబ్బా వైకుంఠం, దాసరి ఉదయశ్రీ, లబ్బా దుర్గా, గోపిరెడ్డి, వింజమూరి సతీష్, దాసరి దుర్గారావు(పెప్సీ) పాల్గొన్నారు.
ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద..
గుణదల: ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమా మహేశ్వరరావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. శానిటేషన్ సిబ్బందికి చీరలు పంపిణీ చేశారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నే వెంకట నారాయణ ప్రసాద్, 26వ డివిజన్ కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి, మాజీ కార్పొరేటర్ కంచర్ల శేషారాణి, వల్లభనేని సతీష్, తోట పాండు, ఘంటా కృష్ణమోహన్, శశి, రవి, సత్య పాల్గొన్నారు.