మూడో రైల్వే లైన్‌ పరిశీలన

ABN , First Publish Date - 2021-12-01T03:53:50+05:30 IST

కాగజ్‌నగర్‌ నుంచి మహారాష్ట్రలోని మాకిడి వరకు చేపడుతున్న రైల్వే మూడో లైన్‌ పనులను మంగళవారం ఏఐజీఎఫ్‌ ఎటీసీఏ వేణుగోపాల్‌, డబ్ల్యూఐఐ కౌశిక్‌ బెనర్జీ అటవీ శాఖాధికారు లతో కలిసి పరిశీలించారు.

మూడో రైల్వే లైన్‌ పరిశీలన
వెంపల్లి రైల్వే ట్రాక్‌ వద్ద మూడో లైన్‌ పనులను పరిశీలిస్తున్న అధికారులు

సిర్పూర్‌(టి), నవంబరు 30: కాగజ్‌నగర్‌ నుంచి మహారాష్ట్రలోని మాకిడి వరకు చేపడుతున్న రైల్వే మూడో లైన్‌ పనులను మంగళవారం ఏఐజీఎఫ్‌ ఎటీసీఏ  వేణుగోపాల్‌, డబ్ల్యూఐఐ కౌశిక్‌ బెనర్జీ అటవీ శాఖాధికారు లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సిర్పూర్‌(టి) మండలంలోని వెంపల్లి రైల్వే గేటు సమీపంలో చేపట్టబోయే పనులను య్యాప్‌ ద్వారా పరిశీలించి పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.  కార్యక్రమంలో కవ్వాల్‌ ఎఫ్‌డీపీటీ సీపీ వినోద్‌కుమార్‌, ఆదిలాబాద్‌ సీసీఎఫ్‌ రామలింగం, డీఎఫ్‌వోలు శాంతారాం, శివానీదోగ్రే తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-01T03:53:50+05:30 IST