మూడో రైల్వే లైన్ పరిశీలన
ABN , First Publish Date - 2021-12-01T03:53:50+05:30 IST
కాగజ్నగర్ నుంచి మహారాష్ట్రలోని మాకిడి వరకు చేపడుతున్న రైల్వే మూడో లైన్ పనులను మంగళవారం ఏఐజీఎఫ్ ఎటీసీఏ వేణుగోపాల్, డబ్ల్యూఐఐ కౌశిక్ బెనర్జీ అటవీ శాఖాధికారు లతో కలిసి పరిశీలించారు.
సిర్పూర్(టి), నవంబరు 30: కాగజ్నగర్ నుంచి మహారాష్ట్రలోని మాకిడి వరకు చేపడుతున్న రైల్వే మూడో లైన్ పనులను మంగళవారం ఏఐజీఎఫ్ ఎటీసీఏ వేణుగోపాల్, డబ్ల్యూఐఐ కౌశిక్ బెనర్జీ అటవీ శాఖాధికారు లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సిర్పూర్(టి) మండలంలోని వెంపల్లి రైల్వే గేటు సమీపంలో చేపట్టబోయే పనులను య్యాప్ ద్వారా పరిశీలించి పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కవ్వాల్ ఎఫ్డీపీటీ సీపీ వినోద్కుమార్, ఆదిలాబాద్ సీసీఎఫ్ రామలింగం, డీఎఫ్వోలు శాంతారాం, శివానీదోగ్రే తదితరులు పాల్గొన్నారు.