ఒడిశాలో మరో 143 మందికి కరోనా... 2,388కి చేరిన కేసులు...

ABN , First Publish Date - 2020-06-03T21:56:28+05:30 IST

ఒడిశాలో ఇవాళ కొత్తగా మరో 143 మందికి కొవిడ్-19 పాజిటివ్ సోకినట్టు గుర్తించారు. దీంతో రాష్ట్రంలో ...

ఒడిశాలో మరో 143 మందికి కరోనా... 2,388కి చేరిన కేసులు...

భువనేశ్వర్: ఒడిశాలో ఇవాళ కొత్తగా మరో 143 మందికి కొవిడ్-19 పాజిటివ్ సోకినట్టు గుర్తించారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,388కి చేరినట్టు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కాగా తాజాగా నమోదైన కేసుల్లో 132 మందిని వివిధ క్వారంటైన్ కేంద్రాల్లో గుర్తించగా... మరో 11 మందిని కాంటాక్ట్ ట్రేసింగ్‌లో గుర్తించామని ఓ అధికారి వెల్లడించారు. ఒడిశాలో ప్రస్తుతం 1,054 మంది కొవిడ్ బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 1325 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఇప్పటి వరకు ఇక్కడ 1,59,567 పరీక్షలు నిర్వహించారు. కాగా కరోనా కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోగా... మరో ఇద్దరికి చనిపోయిన తర్వాత కరోనా సోకినట్టు గుర్తించారు. కేవలం గత నాలుగు రోజుల్లోనే రాష్ట్రంలో 569 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడం గమనార్హం. 

Updated Date - 2020-06-03T21:56:28+05:30 IST