అధికారులు బాధ్యతగా పనిచేయాలి
ABN , First Publish Date - 2020-07-07T10:00:46+05:30 IST
అధికారులు బాధ్యతగా పనిచేయాలి
గుంటూరు(కార్పొరేషన్), జూలై 6: గుంటూరులో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నందున అధికారులు, సిబ్బంది మరింత బాధ్యత పనిచేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ తెలిపారు. నగరంలో నమోదైన కేసులు, అధికారులు తీసుకుంటున్న చర్యలపై ప్రత్యేక విభాగాధిపతులతో సోమవారం జరిగిన సమావేశంలో సమీక్షించారు. కంటైన్మెంట్ జోన్లో ప్రజలు ముఖ్యమైన పనులు ఉంటేనే బయటకు రావాలన్నారు. కార్యక్రమంలో ఏసీ భాగ్యలక్ష్మి, ఎస్ఈ రవికృష్ణరాజు, సిటీ ప్లానర్ సునీత, డీసీలు డీ శ్రీనివాసరావు, బీ శ్రీనివాసరావు, మేనేజర్ వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు.