బావిలోపడి వంట మనిషి మృతి
ABN , First Publish Date - 2021-04-21T05:43:06+05:30 IST
బావిలోపడి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన కలకడ మండలంలో జరిగింది.
కలకడ, ఏప్రిల్ 20: బావిలోపడి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన కలకడ మండలంలో జరిగింది. ఎస్ఐ రవిప్రకాశ్రెడ్డి కథనం మేరకు.. గుడిబండ పంచాయతీ చొక్కనవారిపల్లెకు చెందిన ఎస్.సుధాకర్(40) వంట పని చేసుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు అదే గ్రామానికి చెందిన సుగుణ తో 20 సంవత్సరాల క్రితం వివాహమైంది. నాలుగేళ్ల క్రితం భార్య నుంచి విడిపో యాడు. కడప జిల్లా రాయచోటి తదితర ప్రాంతాలలో వంటపని చేసుకొంటూ అప్పుడప్పుడు గ్రామానికి వచ్చేవాడు. ఈ క్రమంలో 17వ తేదీ సాయంత్రం గ్రామానికి సమీపంలోని బావి వద్ద మద్యం సేవిస్తూ ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. మంగళవారం గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోలీసులు వెలికితీయించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నారు.