బైక్తో చెట్టును ఢీకొని ఒకరి మృతి
ABN , First Publish Date - 2021-01-16T05:49:45+05:30 IST
బైక్తో చెట్టును ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని అచ్చుమాయిపల్లి గ్రామ శివారులో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
దుబ్బాక, జనవరి 15: బైక్తో చెట్టును ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని అచ్చుమాయిపల్లి గ్రామ శివారులో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ మన్నెస్వామి తెలిపిన వివరాల మేరకు.. అచ్చుమాయిపల్లి గ్రామానికి చెందిన సోమారపు వినోద్కుమార్(32)అనే వ్యక్తి బైక్పై దుబ్బాకకు వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొని మృతిచెందాడు. శుక్రవారం తెల్లవారుజామున ఈ విషయాన్ని గమనించిన గ్రామస్థులు కుటుంబసభ్యులతో పాటు పోలీసులకు సమాచారాన్ని అందించారు. దీంతో భార్య భవ్యశ్రీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. దుబ్బాక కమ్యూనిటీ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఎమ్మెల్యే రఘునందన్రావు ఆసుపత్రికి చేరుకుని మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు.