కోతలు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలి
ABN , First Publish Date - 2020-05-10T10:39:43+05:30 IST
వరిధాన్యం కోనుగోలు కేంద్రాల్లో ఎలాంటి కోతలు లేకుండా ధాన్యం కోనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే విజయరమణరావు
పెద్దపల్లి రూరల్, మే 9: వరిధాన్యం కోనుగోలు కేంద్రాల్లో ఎలాంటి కోతలు లేకుండా ధాన్యం కోనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే విజయరమణరావు డిమాండ్ చేశారు. శని వారం మండలంలోని సబ్బితం గ్రామంలో కోనుగోలు కేం ద్రాన్ని పరిశీలించారు. వెంట కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
రైతుల నుంచి ప్రభుత్వం కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జి ఎంఎస్ రాజ్ఠాకూర్ డిమాండ్ చేశారు. శనివారం గుడిపెల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. తాలు, తేప్ప పేరుతో రైతుల వరి ధాన్యం కొనుగోళ్లలో కోతలు విధిస్తూ మోసం చేస్తున్నారని ఆరోపించారు.