ఏడంతస్తుల భవనంపై నుంచి దూకేసింది.. భర్తతో హ్యాపీగా జీవిస్తున్న ఆమె ఈ ఘోరానికి పాల్పడటం వెనుక..

ABN , First Publish Date - 2021-08-04T16:44:18+05:30 IST

ఆమె వివాహిత.. భర్త, ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవనం సాగిస్తోంది..

ఏడంతస్తుల భవనంపై నుంచి దూకేసింది.. భర్తతో హ్యాపీగా జీవిస్తున్న ఆమె ఈ ఘోరానికి పాల్పడటం వెనుక..

ఆమె వివాహిత.. భర్త, ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవనం సాగిస్తోంది.. అలాంటిది గత సోమవారం ఆమె తాము నివసిస్తున్న ఏడో అంతస్థు బాల్కనీ నుంచి కిందకు దూకేసి ఆత్మహత్య చేసుకుంది.. ఆమె ఆత్మహత్య వెనుక ఆమె మామ ఉన్నట్టు సమాచారం రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.. ఆహ్మదాబాద్‌లో సోమవారం ఈ ఘటన జరిగింది. 


ఎల్లిస్‌బ్రిడ్జ్ ప్రాంతంలోని భూదార్‌పురాలో నివసిస్తున్న చందుభాయ్ పర్మార్ గ్యారేజీలో పనిచేస్తున్నారు. అతని కుమార్తె ఆర్తీకి ఐదేళ్ల క్రితం ఆరవల్లికి చెందిన విష్ణుతో వివాహం జరిగింది. అయితే ఆర్తిని ఆమె మామ దినేష్ ఎప్పట్నుంచో ప్రేమిస్తున్నాడు. ఆమె డెలివరీ కోసం పుట్టింటికి వచ్చినపుడు వివాహేతర సంబంధం గురించి బలవంతం చేశాడు. ఆమె అందుకు నిరాకరించి పిల్లలతో కలిసి భర్త దగ్గరకు అహ్మదాబాద్ వెళ్లిపోయింది. ఆ విషయం తెలుసుకున్న దినేష్ కూడా ఆహ్మదాబాద్ వెళ్లి ఆర్తి ఇంటికి సమీపంలోనే ఓ గది అద్దెకు తీసుకున్నాడు.


కొన్ని రోజుల క్రితం, ఆర్తి ఇంటికి వచ్చిన దినేష్ ఆర్తిని బలవంతంగా వాకింగ్‌కి తీసుకెళ్లాడు. భర్తను, తండ్రిని చంపేస్తానని బెదిరించడంతో ఆమె దినేష్‌తో కలిసి వాకింగ్‌కు బయల్దేరింది. ఆ విషయం ఆర్తి భర్త విష్ణుకు తెలియడంతో తన మామగారికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. దినేష్ నుంచి వేధింపులు ఎదురవుతుండడం, భర్త, తండ్రి మందలిస్తుండడంతో ఆమె ఆ ఒత్తిడిని భరించలేకపోయింది. తాము నివసిస్తున్న ఏడో అంతస్థు నుంచి దూకేసి ప్రాణాలు తీసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దినేష్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.   

Updated Date - 2021-08-04T16:44:18+05:30 IST