రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
ABN , First Publish Date - 2020-08-13T11:27:39+05:30 IST
మద్యం మత్తు లో ఉన్న ముగ్గురు యువకులు ఒకే ద్విచక్ర వాహనంపై వెళుతూ రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొ నటంతో ఇద్దరు అక్కడికక్కడే చ
మరో యువకుని పరిస్థితి విషమం
మార్టూరు, ఆగస్టు 12 : మద్యం మత్తు లో ఉన్న ముగ్గురు యువకులు ఒకే ద్విచక్ర వాహనంపై వెళుతూ రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొ నటంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా, మరొకరి పరిస్థితి వి షమంగా ఉంది. ఈ సంఘటన బుధవారం రాత్రి 9 గంటల సమయంలో మండల పరి ధిలోని డేగర మూడి గ్రామ సమీపంలో గ్రానైట్ పరిశ్రమలు ఎదురు రోడ్డుపై చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కనపర్తి రా జేష్ (24) అశోక్ (23) ప్రాణాలు కోల్పోగా, మరో యువకుడు అంకమ్మరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ముగ్గురు లారీ డ్రైవర్లుగా పనిచేస్తుంటారు.
రాజేష్ డేగర మూడిరోడ్డు వద్ద కాలనీలో నివసి స్తున్నాడు. అశోక్ది చీరాల స్వగ్రామం కాగా, మా ర్టూరులో లారీ డ్రైవరుగా పని చేస్తున్నాడు. అంకమ్మరావు మార్టూరులో నివాసం ఉంటున్నాడు. అంకమ్మరావు వివాహితుడు కాగా, మిగిలిన ఇద్దరు అవివాహితులు. ఈ ముగ్గురూ బైక్పై డేగరమూడి వైపు వెళుతూ ఆగి ఉన్న గ్రానైట్ శ్లాబు లోడ్ లారీని వెనక నుంచి ఢీకొట్టారు. ఎస్ఐ శివకుమార్ సంఘటనా స్థలం వద్దకు వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. అంకమ్మరావును ముందు ప్రభుత్వ ఆస్పత్రికి, అనం తరం చిలకలూరిపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రాజేష్, అశోక్ మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మార్టూరు నుంచి నాగరాజుపల్లి వెళ్లే రోడ్డులో ఎదురుగా వస్తున్న కారును బైక్ ఢీకొనటంతో బిళ్లా రవీంద్రబాబు అనే యువకుడు గాయపడ్డారు. నాగరాజుపల్లికి చెందిన రవీంద్రబాబు బైక్పై మార్టూరు వచ్చి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితుడికి పభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేసి ఒంగోలు రిమ్స్కు తరలించారు.