కొనసాగుతున్న పారిశుధ్య కార్మికుల ఆందోళన
ABN , First Publish Date - 2021-04-19T04:48:11+05:30 IST
శృంగవరపుకోట పంచాయతీ పారిశుధ్య కార్మికుల ఆందోళన ఆదివారం నాటికి 17వ రోజుకు చేరింది.
శృంగవరపుకోట, ఏప్రిల్ 18: శృంగవరపుకోట పంచాయతీ పారిశుధ్య కార్మికుల ఆందోళన ఆదివారం నాటికి 17వ రోజుకు చేరింది. రూ.350 దినసరి వేతనంతో పాటు పారిశుధ్య కాంట్రాక్టు కార్మికుల్లో ఒకరికి ఇవ్వాలన్న డిమాండ్తో విధులకు హజరు కాలేదు. పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఽకుటుంబ సభ్యులతో కలసి ధర్నాకు కూర్చొన్న సంగతి తెలిసిందే. అయితే టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టరు సమకూర్చుతున్న కార్మికులతో పంచాయతీ అధికారులు పారిశుధ్య నిర్వహణ పనులు చేయిస్తున్నారు.