స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి
ABN , First Publish Date - 2021-06-19T05:52:38+05:30 IST
స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు నియమ నిబంధనలు పాటించి ప్రభుత్వ అనుమతులు పొందాలని జిల్లా ఉప వై ద్యాధికారి జైపాల్రెడ్డి అన్నారు
జిల్లా ఉప వైద్యాధికారి జైపాల్ రెడ్డి
జగిత్యాల టౌన్, జూన్ 18 : స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు నియమ నిబంధనలు పాటించి ప్రభుత్వ అనుమతులు పొందాలని జిల్లా ఉప వై ద్యాధికారి జైపాల్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పలు స్కానింగ్ సెంట ర్లను జిల్లా వైద్యాధికారి శ్రీధర్ ఆదేశాల మేరకు ఉప వైద్యాధికారి జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనంతరం జైపాల్ రె డ్డి మాట్లాడుతూ అనుమతులు లేకుండా స్కానింగ్ సెంటర్లు, డయా గ్నో స్టిక్ కేంద్రాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు.
పరిస్థితుల్లో గర్భస్థ పిండ నిర్ధారణ పరీక్షలు చేయకూడదన్నారు. ఆడ పిల్లను పుట్టనిద్దాం-బతకనిద్దాం-చదవనిద్దాం అనే నినాదంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తులసీ రమణ, భూమేశ్వర్ ఉన్నారు.