ఉక్రెయిన్లో తమిళ ప్రజలను క్షేమంగా తరలించండి
ABN , First Publish Date - 2022-02-28T17:21:20+05:30 IST
ఉక్రెయిన్లో చిక్కుకున్న 5 వేల మంది తమిళుల సహా మొత్తం 16 వేల మంది భారతీయ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకుని
కేంద్రానికి ఓపీఎస్ వినతి
చెన్నై/అడయార్: ఉక్రెయిన్లో చిక్కుకున్న 5 వేల మంది తమిళుల సహా మొత్తం 16 వేల మంది భారతీయ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకుని రావాలని కేంద్ర ప్రభుత్వానికి మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే సమన్వయకర్త ఓ.పన్నీర్సెల్వం విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్ లో రష్యా యుద్ధం ప్రారంభించడంతో ఆ దేశంలో అనేక మంది భారతీయులు ప్రాణభీతిలో గడుపుతున్నారని, వీరందరినీ కేంద్ర ప్రభుత్వం సురక్షితంగా తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని ఓపీఎస్ విడుదల చేసిన ప్రకటనలో కోరారు.