సేంద్రియ సాగు అభినందనీయం

ABN , First Publish Date - 2022-09-26T04:38:52+05:30 IST

సేంద్రియ వ్యవసా యం చేయడం అభినందనీయమని మాజీ సభ్యు డు విశ్వేశ్వర్‌ అన్నారు.

సేంద్రియ సాగు అభినందనీయం
విద్యార్థులతో కలిసి సేంద్రియ వ్యవసాయ పంటలను పరిశీలిస్తున్న నాయకులు

కొత్తకోట, సెప్టెంబరు 25 : సేంద్రియ వ్యవసా యం చేయడం అభినందనీయమని మాజీ సభ్యు డు విశ్వేశ్వర్‌ అన్నారు. ఆదివారం మిరాసిపపల్లి, నాటవెళ్లి గ్రామాల శివారులోని విశ్వమానవతా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు మూడు రోజుల పాటు జరుగుతున్న నాయకత్వ శిక్షణ శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్‌ మా ట్లాడుతూ విశ్వ మానవతా సంస్థ నిర్వాహకులు అల్లూరి శ్రీనివాస్‌ చౌదరి 60 ఎకరాల్లో అన్ని రకాల పంటల సేంద్రియ వ్యవసాయం చేయడం ఆదర్శనీయమన్నారు. ఆ సాగులో వచ్చే తిండి గింజలతోనే విద్యార్థులకు విద్యపై, యువకులకు ఉపాధి ఆవకాశాలపై శిక్షణ సందర్భంగా భోజనం అందిస్తున్నరన్నారు. చౌదరి ఆశయమైన రసా యన రహిత వ్యవసాయం చేయడానికి రైతులు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. కాలుష్య నివారణకు గురవుతున్న రసాయనాల ను నిషేదించాలని దేశవ్యాప్తంగా సైకిల్‌ యాత్ర నిర్వహించి ప్రజలకు అవగాహన చేయడం పెద్ద సహసమేనన్నారు. శ్రీనివాస్‌ చౌదరి మాట్లాడు తూ విద్యార్థులకు రసాయనాల రహిత ఆహరం అందించడానికి ప్రజాప్రతినిధులు, నాయకులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కొండారెడ్డి, సామాజిక కార్యకర్త ప్రేమయ్య నాయకులు రాంమోహన్‌రెడ్డి, ఖాజామైనోద్దీన్‌, రవీందర్‌రెడ్డి, వహీద్‌అలీ, జహీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-26T04:38:52+05:30 IST