‘ఆక్సిజన్ మరణాల’న్నీ ప్రభుత్వ హత్యలే
ABN , First Publish Date - 2021-06-22T11:59:45+05:30 IST
‘‘ఆక్సిజన్ అందక..
కింజరాపు
శ్రీకాకుళం: ‘‘ఆక్సిజన్ అందక చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో చాలా మంది కరోనా బాధితులు మృతి చెందారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. కొవిడ్ రోగులకు సకాలంలో ఆక్సిజన్ అందించలేని చేతకాని ప్రభుత్వమిది. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి’’ అని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. కరోనా బాధిత కుటుంబాలను ఆదుకోవాలంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్నాయుడు, శ్రీకాకుళం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్ తదితరులు సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లత్కర్కు వినతిపత్రం అందజేశారు.