మంత్రి పెద్దిరెడ్డి సొంత నిధులతో పుంగనూరులో ఆక్సిజన్ ప్లాంట్
ABN , First Publish Date - 2021-05-17T05:27:42+05:30 IST
కరోనా బాధితులకు ఆక్సిజన్ కొరతరాన్వికుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నిధులతో పుంగనూరులో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నుట్లు చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప వెల్లడించారు.
పుంగనూరు, రూరల్ మే 16: కరోనా బాధితులకు ఆక్సిజన్ కొరతరాన్వికుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నిధులతో పుంగనూరులో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నుట్లు చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప వెల్లడించారు. ఆదివారం స్థానిక ప్రభుత్వాస్పత్రికి ఆక్సిజన్ సిలిండర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి తమ సొంత నిధులతో కొనుగోలు చేసిన ఆక్సిజన్ సిలిండర్లు, మిషన్లును కొవిడ్ నోడల్ అధికారి డాక్టర్ రాజశేఖర్కు అందజేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే పుంగనూరు కొవిడ్ సెంటర్కు 150 ఆక్సిజన్ సిలిండర్లను, 20 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రిని 100 పడకల స్థాయికి మార్పు చేయడానికి మంత్రి చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అలీంబాష, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ భాస్కరరెడ్డి, ఏఎంసీ చైర్మన్ నాగరాజరెడ్డి, వైసీపీ నాయకులు నాగభూషణం, వెంకటరెడ్డి యాదవ్, చంద్రారెడ్డి యాదవ్, తదితరులు పాల్గొన్నారు.