ఎంపీ మిథున్రెడ్డి నిధులతో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు
ABN , First Publish Date - 2021-05-18T05:41:43+05:30 IST
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి నిధులతో పీలేరు నియోజక వర్గంలోని మూడు కొవిడ్ కేంద్రాలకు సరఫరా చేసిన 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను వైసీపీ నాయకులు సోమవారం పీలేరు ఆస్పత్రి వైద్యాధికారులకు అందజేశారు.
పీలేరు, మే 17: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి నిధులతో పీలేరు నియోజక వర్గంలోని మూడు కొవిడ్ కేంద్రాలకు సరఫరా చేసిన 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను వైసీపీ నాయకులు సోమవారం పీలేరు ఆస్పత్రి వైద్యాధికారులకు అందజేశారు. వైసీపీ నాయకుడు కంభం సతీష్రెడ్డి, సర్పంచ్ డాక్టర్ హబీబ్ బాషా, మాజీ ఎంపీటీసీ భానుప్రకాశ్ రెడ్డిల ఆధ్వ ర్యంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్కు వీటిని అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ కొవిడ్ బాధితులను ఆదుకోవడానికి ఎంపీ మిథున్రెడ్డి పీలేరు నియోజకవర్గానికి కోటి రూపాయలు సొంత నిధులను విరాళంగా అంద జేశారని, ఈ నిధులతో నియోజకవర్గంలోని కొవిడ్ కేంద్రాలు, ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సదు పాయం, ఇతర వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం పీలేరు, కలికిరి, వాల్మీకిపురం కొవిడ్ కేంద్రాలకు ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందజేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఈశ్వర సురేంద్ర, వైసీపీ నాయకులు ఉదయ్కుమార్, శ్రీనాథ్రెడ్డి, కాలనీ చిన్న పాల్గొన్నారు.