Pakistan: పడవ మునిగి నలుగురి మృతి
ABN , First Publish Date - 2021-07-22T14:06:20+05:30 IST
పాకిస్థాన్ దేశంలో ఓ పడవ మునిగిన దుర్ఘటనలో నలుగురు మరణించగా, మరో 17 మంది గల్లంతయ్యారు....
17 మంది గల్లంతు
ఇస్లామాబాద్ (పాకిస్థాన్): పాకిస్థాన్ దేశంలో ఓ పడవ మునిగిన దుర్ఘటనలో నలుగురు మరణించగా, మరో 17 మంది గల్లంతయ్యారు. పాక్ దేశంలోని ఖైబర్ ఫక్తూన్ ఖవా ప్రావిన్సులోని రాఘగాన్ డ్యాంలో 18 మంది పర్యాటకులు పడవలో విహరిస్తుండగా, ప్రమాద వశాత్తు డ్యాం నీటిలో మునిగిపోయింది. పడవ మునగడంతో పర్యాటకులను కాపాడేందుకు మరో రెండు పడవల్లో డ్యాంలోకి వెళ్లారు. రక్షించడానికి వెళ్లిన పడక కాస్తా మునిగింది. గజఈతగాళ్లు రంగంలోకి దిగి డ్యాం జలాశయంలో మునిగి మరణించిన నలుగురి మృతదేహాలను వెలికి తీశారు. ఈ ప్రమాదంలో 17 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారికోసం గాలిస్తున్నారు. పర్యాటకుల పడవలో సామర్ధ్యానికి మించి ఎక్కువ మంది ఎక్కడం వల్ల నీటిలో మునిగిందని పాక్ పోలీసులు చెప్పారు. రక్షించడానికి వెళ్లిన వారు పడవను నియంత్రించడంలో విఫలమవడంతో నీటిలో మునిగిందని పోలీసులు పేర్కొన్నారు.