చైనాను దాటేసిన పాక్
ABN , First Publish Date - 2020-06-05T07:31:47+05:30 IST
పాకిస్థాన్లో కరోనా వైరస్ ఉధృతంగా విజృంభిస్తోంది. గురువారం ఒక్కరోజే 4,688 మందికి కొత్తగా వైరస్ సోకడంతో మొత్తం కేసుల సంఖ్య 85,246కి చేరుకుంది...
ఇస్లామాబాద్, జూన్ 4: పాకిస్థాన్లో కరోనా వైరస్ ఉధృతంగా విజృంభిస్తోంది. గురువారం ఒక్కరోజే 4,688 మందికి కొత్తగా వైరస్ సోకడంతో మొత్తం కేసుల సంఖ్య 85,246కి చేరుకుంది. ఈ క్రమంలో వైరస్ పుట్టినిల్లు చైనా (84,160)ను దాటేసింది.
వైరస్ నిర్మూలన దిశగా న్యూజిలాండ్
న్యూజిలాండ్లో వరుసగా 13 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 50 లక్షల జనాభా కలిగిన ఈ దేశంలో ప్రస్తుతం ఒకే ఒక యాక్టివ్ కేసు ఉంది. 1500 మంది వైరస్ బారినపడగా 22 మంది చనిపోయారు.
టెనెసీలో కరోనా కలకలం
అమెరికాలోని టెనెసీ రాష్ట్రంలోని చిన్న కౌంటీలో కరోనా కలకలం రేపుతోంది. 7,500 జనాభా ఉన్న ఈ కౌంటీలో వారం రోజుల వ్యవధిలో 352 కేసులు నమోదయ్యాయి.