పాక్‌లో 2.5లక్షలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-07-14T03:00:50+05:30 IST

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకూ ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది.

పాక్‌లో 2.5లక్షలు దాటిన కరోనా కేసులు

ఇస్లామాబాద్: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకూ ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలో దాయాది దేశం పాకిస్తాన్‌లో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో ఇక్కడ 2,769 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో పాక్‌లో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,51,625కు చేరింది. ఈ వివరాలను పాకిస్తాన్ ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. అలాగే ఇక్కడ కొత్తగా 69 కరోనా మరణాలు సంభవించాయని తెలిపింది. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,266కు చేరినట్లు సమాచారం.

Updated Date - 2020-07-14T03:00:50+05:30 IST