మామిడి పండ్లతో ఆలయ అలంకరణ... కోవిడ్ బాధితులకు వితరణ!
ABN , First Publish Date - 2021-05-16T17:33:37+05:30 IST
మహారాష్ట్రలోని పండర్పూర్లోగల విఠల్- రుక్మిణి ఆలయంలో...
పండర్పూర్: మహారాష్ట్రలోని పండర్పూర్లోగల విఠల్- రుక్మిణి ఆలయంలో అక్షయ తృతీయ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సుమారు ఏడు వేల మామిడిపండ్లతో అలంకరించారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాపిస్తున్న తరుణంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఆలయంలో అక్షయ తృతీయ వేడుకలు నిర్వహించారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం పూణేకు చెందిన వినాయక్ కచ్చి అనే వ్యాపారవేత్త ఈ మామిడి పండ్లను ఆలయానికి అందించారు. మామిడి పండ్లతో అలంకరించిన ఈ ఆలయానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో లభించే అల్ఫోన్సో రకపు మామిడి పండ్లను ఆలయ అలంకరణ కోసం వినియోగించారు. అనంతరం ఈ మామిడి పండ్లను కరోనా బాధితులకు పంపిణీ చేశారు.
MrudulWorld All-in-One సౌజన్యంతో...