పరమ్‌ బీర్‌కు రూ.5వేలు ఫైన్‌

ABN , First Publish Date - 2021-06-23T09:58:44+05:30 IST

తమ ముందు హాజరు కానందుకు రిటైర్డ్‌ హైకోర్టు జడ్జి కైలాష్‌ ఉత్తమ్‌చంద్‌ ఏక సభ్య కమిషన్‌ మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌ బీర్‌ సింగ్‌కు రూ.5వేల జరిమానా విధించింది

పరమ్‌ బీర్‌కు రూ.5వేలు ఫైన్‌

కమిషన్‌ ముందు హాజరుకానందుకు జరిమానా


ముంబై, జూన్‌ 22: తమ ముందు హాజరు కానందుకు రిటైర్డ్‌ హైకోర్టు జడ్జి కైలాష్‌ ఉత్తమ్‌చంద్‌ ఏక సభ్య కమిషన్‌ మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌ బీర్‌ సింగ్‌కు రూ.5వేల జరిమానా విధించింది. రెస్టారెంట్లు, బార్ల యజమానుల నుంచి డబ్బులు వసూలు చేయమని అప్పటి రాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ పోలీసు అధికారులను అడిగేవారని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు రాసిన లేఖలో పరమ్‌ బీర్‌ ఆరోపించారు. ఈ ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ కైలాష్‌ ముందు మంగళవారం పరమ్‌ బీర్‌ హాజరు కాలేదు. సమన్లు అందలేదని ఆయన తరఫు న్యాయవాది చెప్పినప్పటికీ రూ.5వేలు జరిమానా విధిస్తున్నట్టు తెలిపారు.

Updated Date - 2021-06-23T09:58:44+05:30 IST