ఆస్పత్రిలో కుప్పకూలిన రోగి
ABN , First Publish Date - 2021-08-02T05:29:36+05:30 IST
వైద్యం కోసం ఆస్పత్రికొచ్చిన ఓ రోగి హఠాత్తుగా కుప్పకూలింది. అత్యవసర విభాగం వైద్యులు మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది
మదనపల్లె క్రైం, ఆగస్టు 1: వైద్యం కోసం ఆస్పత్రికొచ్చిన ఓ రోగి హఠాత్తుగా కుప్పకూలింది. అత్యవసర విభాగం వైద్యులు మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది. వివరాలిలా.. కడప జిల్లా గాలివీడుకు చెందిన హనుమంత రెడ్డి భార్య పార్వతమ్మ(50)కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈనేపథ్యంలో కుటుంబీకులు రెండురోజుల క్రితం మదనపల్లెలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. కాగా ఆదివారం ఆమె పరిస్ధితి విషమంగా మారడంతో జిల్లా వైద్యశాలకు రెఫర్ చేశారు. ఈక్రమంలో ఆటో నుంచి కిందకు దిగిన పార్వతమ్మ ఉన్నట్టుండి కిందపడిపోయింది. అత్యవసర విభాగం వైద్యులు తక్షణం వైద్యం అందించ డంతో ప్రమాదం తప్పింది. కాగా బాధితురాలికి కొవిడ్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్గా తేలింది. దీంతో ఆమెను కొవిడ్ ఆస్పత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు.