లక్ష రఘుపతి లడ్డూలు పంచనున్న మహావీర్ ట్రస్టు

ABN , First Publish Date - 2020-08-04T22:48:10+05:30 IST

అయోధ్యలో రామాలయ భూమిపూజ నేపథ్యంలో ఆగస్టు 5న లక్షకు పైగా 'రఘుపతి లడ్డూలు' వివిధ పుణ్యస్థలాల్లో..

లక్ష రఘుపతి లడ్డూలు పంచనున్న మహావీర్ ట్రస్టు

పాట్నా: అయోధ్యలో రామాలయ భూమిపూజ నేపథ్యంలో ఆగస్టు 5న లక్షకు పైగా 'రఘుపతి లడ్డూలు' వివిధ పుణ్యస్థలాల్లో పంచనున్నట్టు పాట్నా మహావీర్ మందిర్ ట్రస్టు ప్రకటించింది. ట్రస్టు కన్వీనర్ కిషోర్ కునల్ మంగళవారంనాడు మీడియాతో మాట్లాడుతూ, లక్ష లడ్డూల్లో 51,000 లడ్లు రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర్ ట్రస్టుకు అందజేయనున్నట్టు చెప్పారు. తక్కిన లడ్డూలను సీతామర్హిలోని పునౌర థామ్ (రాముని పాదముద్రలున్న ప్రాంతం), తదితర యాత్రా స్థలాలకు పంపుతామని చెప్పారు. బీహార్‌లోని పలు ప్రాంతాల్లోనూ లడ్డూలను పంచుతామని వివిరించారు. అయోధ్యలో జరగనున్న భూమిపూజ ఆహ్వానితుల్లో ఆచార్య కిషోర్ కునల్ కూడా ఉన్నారు.

Updated Date - 2020-08-04T22:48:10+05:30 IST