ఘనంగా పవన్‌ జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2022-09-03T06:18:39+05:30 IST

శుక్రవారం జనసేన అధినేత, సినీ హీరో పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.

ఘనంగా పవన్‌ జన్మదిన వేడుకలు

శుక్రవారం జనసేన అధినేత, సినీ హీరో పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు వేడుకలు  ఘనంగా జరిగాయి. అభిమానులు, జనసైనికులు కేక్‌  కట్‌ చేసి  ర్యాలీలు నిర్వహించారు. సేవా కార్యక్రమాలు జరిగాయి.

కైకలూరు, సెప్టెంబరు 2: కైకలూరులో జనసైనికుడు బీవీ రావు ఆధ్వర్యంలో  నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో  కేక్‌ కట్‌ చేసి వేడుకలను జరిపారు. కోరుకొల్లు సర్పంచ్‌ బట్టు లీలాకుమారి, పార్టీ నాయకులు తోట లక్ష్మి, అట్లూరి రాజేష్‌, వీరేంద్ర,  అభిమానులు పాల్గొన్నారు. 

మండవల్లి:  మండవల్లిలో  పార్టీ మండల అధ్యక్షురాలు బోయిన ప్రశాంతి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.  జనసైనికులు బోయిన రాజేష్‌, వెంకటేష్‌, గుబిలి వంశీకృష్ణ, పూర్ణచంద్రరావు, మణికంఠస్వామి తదితరులు పాల్గొన్నారు. 

కలిదిండి: కలిదిండిలో  భారీ కేక్‌ను కట్‌ చేశారు. అనంతరం  మోటార్‌ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. జనసైనికులు చలపతిరావు, వెంకన్న బాబు,   లక్ష్మణ్‌, స్వర్ణకుమారి, కనక లింగేశ్వరరావు, శ్రీరామసాయి, చక్ర పాణి తదిత రులు పాల్గొన్నారు. కోరుకొల్లులో  అభిమానులు  రోగులకు, వృద్ధులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.  మోటార్‌ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు.  బీవీ రావు, నల్లగోపుల చలపతిరావు, బట్టు లీలా కనకదుర్గ, మహేష్‌, చెన్నంశెట్టి చక్రపాణి, శ్రీరామసాయి, వలవల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ముదినేపల్లి: మండలంలో జనసైనికులు, కార్యకర్తలు, చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ అభిమాన సంఘాల నాయకులు వేడుకలు నిర్వహించారు.  పలు ప్రాంతాల్లో పార్టీ మండల  అధ్యక్షుడు వీరంకి వెంకటేశ్వరరావు, జిల్లా ప్రతిని ధులు మోటేపల్లి హనుమ, వేల్పూరి నానాజీ, వర్రె హనుమాన్‌ ప్రసాద్‌, కూనపరెడ్డి రాజారావు కేక్‌  కట్‌ చేశారు. ముదినేపల్లిలో అన్నదానం జరిపారు. నాయకులు పోకల కృష్ణ, అంబుల భరత్‌, సుదాబత్తుల సాయిష్‌, బ్రహ్మాజీ, గుడిసేవ సురేష్‌, దాసరి రమేష్‌, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

ముదినేపల్లి రూరల్‌: కొత్తపల్లి, సింగరాయి పాలెం, నారాయణపురం, ఊటుకూరు, వైవాక, దేవపూడి, గురజ, వాడవల్లి గ్రామాల్లో వేడుకలు జరిగాయి. జనసైనికులు ర్యాలీగా వెళ్లి పేదలకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.  కేక్‌  కట్‌ చేసి పవన్‌ యూత్‌కు పంపిణీ చేశారు. జనసేన మండల కన్వీనర్‌ వీరంకి వెంకటేశ్వరరావు, నానాజీ, తదితరులు హాజరయ్యారు. 

ముసునూరు: రమణక్క పేటకు చెందిన జనసైనికుడు పాశం నాగబాబు ఏలూరు అమ్మ వృద్ధాశ్రమానికి అన్నదానం నిమిత్తం రూ. 5 వేలు అంద జేశారు.  మండల ఉపాధ్యక్షుడు బోట్ల నాగేంద్రప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి సురేష్‌, జనసైనికులు రాఘవ, శ్రీరామ్‌ తదితరులు పాల్గొన్నారు.  

నూజివీడు టౌన్‌: తుక్కులూరు వృద్ధాశ్రమంలో పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు వేడుకలను బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్‌  ప్రారంభించారు. అనంతరం వృద్ధులకు పండ్లు, మిఠాయిలు అందజేశారు.  గిరిహరీష్‌, సురేష్‌, నానాజీ తదితరులు పాల్గొన్నారు.

చాట్రాయి: చాట్రాయి సెంటర్‌లో పవన్‌ కల్యాణ్‌  అభిమానులు  కేక్‌ కట్‌ చేసి ప్రజలకు పంపిణీ చేశారు.  

ఆగిరిపల్లి: శుక్రవారం పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ నాయకులు, అభిమానులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్టాండ్‌ సెంటర్‌లో  కేక్‌ కట్‌  చేశారు. 

Updated Date - 2022-09-03T06:18:39+05:30 IST