రేపు పవన్‌ రాక

ABN , First Publish Date - 2021-01-21T06:17:19+05:30 IST

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఈనెల 22, 23 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు.

రేపు పవన్‌ రాక


రాత్రికి ఒంగోలులో బస

23న ఎస్పీతో భేటీ, 

వెంగయ్య కుటుంబానికి పరామర్శ

ఒంగోలు, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఈనెల 22, 23 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. నాలుగురోజుల క్రితం బేస్తవారపేట మండలం సింగరపల్లిలో ఆత్మహత్య చేసుకున్న వెంగయ్య నాయుడు కుటుంబాన్ని పరామర్శించి పార్టీపరంగా కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు స్వయంగా పవన్‌ కళ్యాణ్‌ వస్తున్నారు. గ్రామం లో సమస్యల విషయమై గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును ప్రశ్నిం చడం, ఆ సందర్భంగా ఎమ్మెల్యే స్పందించిన తీరు, అనంతరం గ్రామంలో అధికారపార్టీకి చెందిన నేతల ఒత్తిడితో మనస్తాపం చెంది వెంగయ్య ఆత్మ హత్య చేసుకున్నట్లు జనసేన నాయకులు ఆరోపించిన విషయం తెలిసిం దే. ఈ నేపథ్యంలో వెంగయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు పవన్‌ కల్యాణ్‌ వస్తున్నారు. పార్టీవర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈనెల 22న పవన్‌ తిరుపతి నుంచి రోడ్డుమార్గాన సాయంత్రానికి ఒంగో లు చేరుకొని రాత్రికి ఇక్కడే బసచేస్తారు. 23న ఎస్పీని కలిసి ఘటనపై చర్చించడంతో పాటు వెంగయ్య కుటుంబాన్ని పరామర్శించి పార్టీ తరఫున ఆర్థికసహాయం అందించనున్నారు. కాగా శుక్రవారం పవన్‌ పర్యటన పూ ర్తి వివరాలపై స్పష్టత వస్తుందని పార్టీ నేతలు చెప్పారు. 


Updated Date - 2021-01-21T06:17:19+05:30 IST